నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ని వ్యూహాత్మకంగా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసిన రోజు మొదలు ఈనాటి వరకు జరిగిన, జరుగుతున్న పరిస్థితులు కూడా అందరికీ తెలిసినవే.
ఇదిలాఉంటే ఆమె ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ఈనెల 26 వ తారీకు నుంచి పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు.అదే సమయంలో “జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్” లు ఇద్దరూ ప్రచారంలో పాల్గొంటారా అని అడిగిన ప్రశ్నకు, ఎవరిష్టం వారిది అన్నట్టు బాలయ్య సమాధానం చెప్పడంతో సుహాసినికి తమ్ముళ్లు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు మద్దతిస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అయ్యింది.అంతేకాదు
ఎన్నో రకాల ఊహాగానాలు వెలువడటంతో ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ చంద్రబాబు కు షాక్ ఇస్తూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తమ నిర్ణయాన్ని ప్రకటించారు.అదేంటంటే.కూకట్పల్లి నుంచి బరిలోకి దిగిన తమ అక్క చుండ్రు సుహాసినికి భారీగా ప్రచారం చేయాలని తమ్ముళ్ళు ఇద్దరు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇదే సమయంలో బాబు వేసిన మాస్టర్ ప్లాన్ ని బ్రేకులు వేస్తూ షాక్ ఇచ్చారట.
తమ అక్కకి ఎలాగో ప్రచారానికి తప్పకుండా వస్తారని భావించిన బాబు వారిని ఇదే వంకతో శేర్లింగంపల్లి, సనత్నగర్ ,జూబ్లీహిల్స్ పటాన్చెరువు ,మల్కాజ్గిరి, ఖైరతాబాద్ లలో ఇద్దరి చేత ప్రచారం చేయించి వాటిలో విజయం సాధించాలని బాబు వ్యూహం పన్నారు.అయితే బాబుకు షాక్ ఇస్తూ వారిద్దరూ ప్రచారానికి ససేమిరా అన్నట్లు గా తెలుస్తోంది
కేవలం మాతో బొట్టు గురించి మాత్రమే మేము ప్రచారానికి ఒప్పుకున్నాం తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారట అంతేకాదు…చివరికి ఏపీలో సైతం ప్రచార బాధ్యతలు తీసుకోమని తెగేసి చెప్పారట ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకే మాటపై ఉన్నారని ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ప్రచారం చేయబోమని పంతం పట్టుకుని ఉన్నారని తేలడంతో తలపట్టుకున్నారట బాబు.ఈ ఊహించని షాక్ తో ఏమి చేయాలో అర్థం కాక బాలయ్యతో పూర్తి స్థాయి ప్రచారం చేయించలేక ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో బాబు కి చుక్కలు చూపించడం ఖాయం అంటున్నారట విశ్లేషకులు.