నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్లు తమ తమ సినిమాలతో సంక్రాంతికి ఢీ అంటే ఢీ అనబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం వీరిద్దరు నటిస్తున్న ‘డిక్టేటర్’ మరియు ‘మా నాన్నకు ప్రేమతో’ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిపేందుకు దర్శకు సర్వ శక్తులు ఒడ్డుతు శర వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
సంక్రాంతికి ముందు ఈ నందమూరి బాబాయి, అబ్బాయిు ఢీ అంటే ఢీ అనేందుకు సిద్దం అవుతున్నారు.
బాబాయి, అబ్బాయిల చిత్రాల ఫస్ట్లుక్ టీజర్లు వినాయక చవితి సందర్బంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
వినాయక చవితికి నందమూరి ఫ్యాన్స్ కోసం ఈ ఇద్దరు కూడా మంచి ట్రీట్ను ఏర్పాట్లు చేస్తున్నారు.ఫస్ట్లుక్ టీజర్లు ఒకే రోజు విడుదల అయితే ఏం పర్వాలేదు, ఒకే సారి సినిమాల విడుదల అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం అని, విశ్లేషకులు అంటున్నారు.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాల కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలయ్య కెరీర్లో 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్కు కొత్త బాలయ్యను చూపిస్తుందట.
శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.బాలయ్యకు జోడీగా అంజలి మరియు సోనాల్ చౌహాన్లు హీరోయిన్స్గా నటిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ 25వ సినిమా అయిన ‘మా నాన్నకు ప్రేమతో’ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.భారీ బడ్జెట్తో ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.