ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటికే ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అది సూపర్ హిట్ అయ్యింది.ఒక్క సీజన్ తోనే ఎన్టీఆర్ మళ్లీ కనిపించకుండా పోయాడు.
ఆ విషయమై అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు.ఎన్టీఆర్ తర్వాత నాని మరియు నాగార్జునలు వచ్చారు.
కాని వారిద్దరు కూడా ఎన్టీఆర్ రేంజ్ లో ఆకట్టుకోలేక పోయారు అనేది ప్రతి ఒక్కరు అంటున్న విషయం.బిగ్ బాస్ ను ఎన్టీఆర్ చేసి వదిలేసి పోయాడు కనుక ఆ షో మరెవ్వరు చేసినా కూడా అంతగా ఆకట్టుకోలేక పోతున్నారు.
ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు షో ను ఎన్టీఆర్ ఎన్ని సీజన్ లు చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.జెమిని టీవీ వారు ముందే ఎన్టీఆర్ తో మూడు సీజన్ లకు ఒప్పందం చేసుకుని ఉంటారు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి.
నేడు జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పేశాడు.
ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎవరు మీలో కోటీశ్వరుడు ఎన్ని సీజన్ లకు హోస్ట్ గా చేస్తాను అనేది అయితే ఇప్పుడే చెప్పలేను.
మొదట ఈ ఒక్క సీజన్ ను అయితే పూర్తి అవ్వనివ్వండి.అప్పుడు షో నిర్వాహకులు ఈయన వద్దు అనుకుంటారో లేదా ప్రేక్షకులు బాబోయ్ వద్దు అంటారో లేదా నేను వద్దని అనుకుంటానో చెప్పలేము.
అందుకే ఈ ఒక్క సీజన్ తర్వాత కాని ఏ విషయాన్ని చెప్పలేను అన్నాడు.అంటే బిగ్ బాస్ మాదిరిగానే ఎవరు మీలో కోటీశ్వరులు కూడా ఎన్టీఆర్ ఒక్క సీజన్ కు మాత్రమే సైన్ చేశాడు.
మరి అది ముందు ముందు కొనసాగుతుందా అంటే చూడాలి అన్నట్లుగా ఆయన నుండి సమాధానం వచ్చింది.కనుక ఇప్పుడే ఆ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేము.భవిష్యత్తులో ఏమైనా జరుగవచ్చు.ప్రేక్షకుల నుండి యాజమాన్యం నుండి ఎన్టీఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఖాయం.
ఆయన నుండి ఎలాంటి స్పందన ఉంటుంది అనేది సీజన్ ముగిస్తే కాని తెలియదు.