యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.
మరో రెండు మూడు నెలల్లో సినిమా ను ముగించే అవకాశాలు ఉన్నాయి.ఈ సమయంలోనే ఎన్టీఆర్ నుండి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందబోతుంది.కొరటాల ఆచార్య సినిమా ముగించిన వెంటనే ఎన్టీఆర్ సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.
పెద్ద ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది.
అందుకే ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఈ రెండు సినిమాలు కాకుండా ఎన్టీఆర్ నుండి మూడవ సినిమా ప్రకటన వచ్చేసింది.
ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ గా ఆనందించే ప్రకటన అధికారికంగా వచ్చేసింది.
ఎన్టీఆర్ 30వ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇక ఎన్టీఆర్ 31వ సినిమా కుడా కన్ఫర్మ్ అయ్యింది.ఆ సినిమా నే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న సినిమా.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా విడుదలకు ముందే ప్రభాస్ తో సలార్ ను మొదలు పెట్టాడు.
ఈ ఏడాది చివరి వరకు సలార్ పూర్తి అవుతుంది.ఆ వెంటనే ఎన్టీఆర్ 31వ సినిమాకు ఈ కేజీఎఫ్ డైరెక్టర్ సిద్దం అయ్యే అవకాశం ఉంది.
భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఎన్టీఆర్ తో సినిమా ను ప్రశాంత్ నీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్ తో సినిమాను ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించబోతున్నాడట.
బర్త్ డే సందర్బంగా ప్రశాంత్ నీల్ మూవీ కన్ఫర్మ్ అవ్వడం పట్ల అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2022 చివర్లోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ల సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.