యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది.అయినా ఇప్పటి వరకు చిత్రీకరణ ప్రారంభించలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం అవ్వడంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వచ్చి ఆ సినిమా భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది.దాంతో ఎన్టీఆర్ సినిమా విషయం లో కాస్త జాగ్రత్త ఎక్కువ అయింది.
ఆ కారణంగా ఏకంగా ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించారు.
ఆ మధ్య ఫిబ్రవరి లో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.మార్చి మొదటి వారం లో మొదటి షెడ్యూల్ ని ఖరారు చేయడం జరిగింది.
ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ ఇప్పటికే సమాచారం అందుతుంది.ఇక సాధారణంగా మొదటి షెడ్యూల్ లో హీరోలపై మాత్రమే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతారు.
కానీ ఎన్టీఆర్ 30 సినిమా కి మాత్రం మొదటి షెడ్యూల్ లోనే హీరో హీరోయిన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ పేర్కొన్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.ఆమె కూతురు జాన్వీ కపూర్ తెలుగు లో ఇప్పటి వరకు నటించకున్నా కూడా ఆమె యొక్క హాట్ ఫొటో షూట్స్ తో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దాంతో ఈ సినిమా పై ఆమె చాలా ఆశలు పెట్టుకుని ఉంది.
ఎన్టీఆర్ ఆమె కి మొదటి కమర్షియల్ సక్సెస్ ని కట్టబెడతాడా అనేది చూడాలి.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ 30 సినిమా విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.