రామజన్మ భూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‎కు కరోనా..!

రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‎కు కరోనా బారిన పడ్డారు.ఆయనకు శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడడంతో వైద్యులు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 Ramajanma Bhoomi Trust, Nritya Gopal Das, Corona Positive, Ayodhya, Up Cm Yogi A-TeluguStop.com

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు మథుర వెళ్లిన నృత్యగోపాల్ దాస్… ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.నృత్యగోపాల్ దాస్‎కు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

ఇప్పటికే మథుర డీఎంతో మాట్లాడినట్లు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయం ప్రకటించింది.

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరిగిన భూమిపూజ కార్యక్రమాలను నృత్య గోపాల్ దాస్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే.

రామ మందిర భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ గవర్నర్ ఆనందిబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నృత్య గోపాల్ వేదికను పంచుకున్నారు.రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగిన వారం రోజులకే నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు.

కాగా, ఈ కార్యక్రమానికి ముందే ఆలయ పూజారి ప్రదీప్ దాస్‎తో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube