అమెరికాలోని ఒహాయో లో అత్యంత కిరాతకంగా హత్యకి గురైన ఎన్నారై కుటుంభానికి న్యాయం చేయాలి అంటూ వెస్ట్చెస్టర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భారత ఎన్నారైలు ఏప్రిల్ 30న హకీకత్ సింగ్, అతని భార్య పరాంజిత్ కౌర్, వారి కూతురు షాలీందర్ కౌర్, పరాంజిత్ చెల్లి ఈ నలుగురిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు.
వారి నుదిటిపై తుపాకి తో కాల్చి చంపేశారు.ఈ ఘటన జరిగి నెలలు కావస్తున్నా సరే పోలీస్లు ఇప్పటి వరకూ చర్యలు చేపట్టలేదని.ఈ హత్యలు ద్వేషంతోనే జరిగాయని మృతుల కుటుంభ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారికి న్యాయం చేయాలి అంటూ ఎంతో మంది పంజాబీలు అమెరికాలో నిరసనలు చేపట్టారు.ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని పట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు.
దర్యాప్తు చేస్తున్నాం అంటూ నెలలు గడుపుతున్నారు తప్ప,ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, స్థానిక పోలీసులు ఈ కేసు విషయంలో శ్రద్ద చూపడం లేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకూ కుటుంభ సభ్యులకి మృతదేహాలు కూడా అప్పగించలేదని, నెల రోజుల తరువాత మృతదేహాలు అప్పగించడంతో మృత దేహాలు అంత్యక్రియలు జరపలేని విధంగా మారాయని ఆవేదన చెందారు.
నిన్నటి రోజున భారత్ కి ఆ మృతదేహాలు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.