కరోనా పేరేత్తితేనే ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే.చైనాలో వ్యాధి తీవ్రత తగ్గుతుండగా.
ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీలో కరోనా మరణాలు, బాధితులు పెరుగుతున్నారు.బయటి దేశాల్లో పరిస్ధితి దృష్ట్యా భారతదేశం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
తాజాగా కోయంబత్తూరులో ఓ ప్రవాస భారతీయుడిలో కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు.
ఫిబ్రవరి చివరిలో మలేషియా నుంచి తమిళనాడు వచ్చిన తిరుపూర్కు చెందిన ఓ వ్యక్తిలో నవల్ కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
దీంతో అధికారులు కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.అతను గత ఆరేళ్లుగా మలేషియాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం కొచ్చి విమానాశ్రయంలో దిగి మంగళవారం రోడ్డు మార్గంలో కోయంబత్తూరు చేరుకున్నాడు.
ఫ్లూ లక్షణాలతో అతను కోవై మెడికల్ సెంటర్ హాస్పిటల్ (కెఎంసీహెచ్)లో చేరాడు.అతనిని పరీక్షించిన వైద్యులు ఫ్లూతో బాధపడుతున్నట్లుగా తేల్చారు.సీటీ స్కాన్ అనంతరం ఊపిరితిత్తుల్లో ఉన్న న్యూమోనియాను గుర్తించినట్లు ఆసుపత్రి డీన్ డాక్టర్ అశోకన్ చెప్పారు.మొదట ఆ వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా.
అక్కడి వైద్యులు తమ వద్దకు పంపినట్లు చెప్పారు.
ఐసోలేషన్ వార్డులో అతని గొంతులోని నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు అశోకన్ చెప్పారు.
ఒక రాత్రి తమ వద్ద ఉంచుకున్న అనంతరం అతనిని ఈఎస్ఐ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు డాక్టర్ తెలిపారు.పూణే నుంచి వచ్చిన రిపోర్టులో అతను నెగిటివ్ అని తేలడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని.
అయితే ఇల్లు దాటి బయటకు వెళ్లరాదని సూచించినట్లు అశోకన్ పేర్కొన్నారు.