ఎన్నారై అల్లుల్ల బాగోతాలు రోజుకోకటి భారత్లో వెలుగుచూస్తున్నాయి.దీంతో తమ బిడ్డ సుఖంగా ఉంటుందని ఆశించిన ఆడపిల్ల తల్లిదండ్రుల కలలు కల్లుగానే మిగిలిపోతున్నాయి.
తాజాగా ఇండోర్కు చెందిన ఓ మహిళ తన ఎన్ఆర్ఐ భర్తపై వరకట్న వేధింపులతో పాటు గృహహింస కేసు పెట్టింది.తన తల్లిదండ్రులను అడిగి రూ.50 లక్షల నగదు, మెర్సిడెస్ బెంజ్ కారు తీసుకురావాలని భర్త, అత్తమామలు, మరిది ప్రతిరోజూ వేధించేవారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతేకాకుండా తన కళ్లేదుటే తన భర్త అతని స్నేహితుల భార్యలతో తప్పుగా ప్రవర్తించడంతో పాటు మాంసాహారం తినాల్సిందిగా వేధించేవాడని ఆమె వాపోయింది.
కోల్కతాకు చెందిన విక్రమ్ డేతో ఇండోర్కు చెందిన ప్రగతి శ్రీవాత్సవకు 2016 డిసెంబర్లో వివాహం జరిగింది.విక్రమ్ సుమారు రూ.25 లక్షలు పెట్టి ఘనంగా తన పెళ్లి చేసుకున్నాడు.అదే సమయంలో కట్నంగా రూ.50 లక్షలు డిమాండ్ చేయగా.తన తండ్రి ఓం ప్రకాశ్ శ్రీవాస్తవ రూ.15 లక్షలు నగదు ఇచ్చారు.అయితే కోల్కతాకు వచ్చిన వెంటనే అత్తమామలు తనను రూ.50 లక్షలు నగదు, మెర్సిడెస్ బెంజ్ కారు డిమాండ్ చేయడం ప్రారంభించారని ప్రగతి తెలిపారు.ఆమె భర్త అమెరికాలోని ఫీనిక్స్లో ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేవాడు.
తాము అడిగినది తీసుకురాకపోవడం, ప్రగతి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అత్తింటివారు ఆమెను ఒక గదిలో బంధించారు.డిసెంబర్ 13న విక్రమ్ను ఫినిక్స్కు ఒంటరిగా పంపారు.మరోసారి 2017లో విక్రమ్ కోల్కతాకు వచ్చినప్పుడు అతని తండ్రి దిలీప్ కుమార్ డే.తమ కోరికలు తీర్చకపోతే తన కుమారుడికి రెండో పెళ్లి చేస్తామని ప్రగతిని బెదిరించాడు.తిరిగి 2018 డిసెంబర్లో ఇండోర్కు వచ్చిన విక్రమ్….ప్రగతి తల్లిదండ్రులను రూ.50 లక్షలు చెల్లించాలని చెప్పి, డిసెంబర్ 24న ఒంటరిగా ఫీనిక్స్ వెళ్లాడు.అత్తింటి కుటుంబం వేధింపులు ఎక్కువ కావడంతో ప్రగతిలో సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు ప్రగతి భర్త విక్రమ్ డే, మామ దిలీప్ కుమార్ డే, అత్త రాధా డేతో పాటు కోల్కతాలో ఉంటున్న జెత్ అంకుర్ డేలపై ఫిర్యాదు చేశారు.