బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ఓ ప్రవాస భారతీయుడు చీటింగ్ కేసు పెట్టాడు.వీరి యాజమాన్యంలో ఉన్న ఓ సంస్థ తనను గోల్డ్ స్కీం పేరిట మోసం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2014లో ఓ గోల్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిందని.దీనిలో భాగంగా రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నానని సచిన్ జోషి తెలిపారు.ఆ సమయంలో కిలో బంగారం కొంటే ఓ గోల్డ్ కార్డ్ ఇచ్చి ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగిసిన తర్వాత దానిని మార్చుకుంటే కొంత బంగారం ఇస్తామని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐదేళ్ల తర్వాత స్కీం కాలపరిమితి 2019 మార్చి 25తో ముగిసిందని.తాను గోల్డ్ కార్డ్ మార్చుకోవాలని భావించానన్నారు.ఇందుకోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళితే.
క్లోజ్డ్ బోర్డు కనిపించిందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆ కంపెనీ గురించి ఆరా తీస్తే.
శిల్పా, రాజ్లు సత్యయుగ్కు డైరెక్టర్లుగా వ్యవహరించారని, అయితే 2016, 2017లలో తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిసిందని సచిన్ వెల్లడించారు.తాను మోసపోయానని గ్రహించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని సచిన్ కన్నీటి పర్యంతమయ్యారు.