అమెరికా లోని ఒక సరస్సు లో ఆంధ్ర యువకుడు గల్లంతు అయ్యాడు.ఉన్నత చదువు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ కు చెందిన ఎ.
వెంకటరావు కుమారుడు అవినాష్ అమెరికా వెళ్ళాడు.ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్ అక్కడ ఎం ఎస్ పూర్తి చేసుకొని ఉద్యోగంలో కూడా చేరాడు.
అయితే వీకెండ్ కావడం తో రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి అమెరికా లోని ఒక సరస్సు లో విహార యాత్రకు వెళ్ళాడు.ఈ క్రమంలో అక్కడ బోటు షికారుకు వెళ్లిన అవినాష్ ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయినట్లు తెలుస్తుంది.
దీనితో అవినాష్ ఆచూకీ లభించకపోవడం తో అతడు గల్లంతు అయినట్లు భావిస్తున్నారు.
సరస్సు లోతుగా ఉండడం, అంతేకాకుండా ఊబి కూడా ఉండడం తో అవినాష్ గల్లంతు అయి ఉంటాడు అని అధికారులు భావిస్తున్నారు.
అయితే ఈ విషయాన్నీ అవినాష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది.దీనితో అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం అవినాష్ ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.