సూరత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఓ ఎన్ఆర్ఐ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.అహ్మదాబాద్కు చెందిన ఎన్ఆర్ఐ కిరీట్ తుమ్మర్ బుధవారం వెసులోని తన స్నేహితుని ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నాడు.
డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నాడు.ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఉధ్నా-మాగ్డల్లా రోడ్లో కిరీట్ ప్రయాణిస్తున్న కారు ట్రక్ను ఢీకొట్టి, బొల్తా పడింది.
వెంటనే స్పందించిన స్థానికులు అతనిని తొలుత న్యూ సివిల్ హాస్పిటల్కు అక్కడి నుంచి మహావీర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఖతోదర పోలీస్ అధికారి మాట్లాడుతూ.
కిరీటి ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిపారు.అహ్మదాబాద్లోని సోలా ప్రాంతంలో డాక్టర్గా పనిచేస్తున్న అతని కుమార్తె ఎలాంటి కేసును నమోదు చేయొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
బుధవారం సాయంత్రం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో కారు.రిక్షాను ఢీకొట్టడంతో రిక్షావాలా జితు పాటిల్ మరణించాడు.మాగ్డల్లా నుంచి తన మిత్రుడు సాగర్ మిస్త్రీతో కలిసి పాటిల్ ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.తీవ్రగాయాల పాలైన వీరిద్దరిని వాహనదారులు న్యూ సివిల్ హాస్పిటల్కు తరలించారు.
అక్కడ జితు పాటిల్ చికిత్స పొందుతూ మరణించాడు.