రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పడం కష్టం.ఎలాంటి పరిణామాలనైనా తట్టుకుని రాజకీయాల్లో ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది.
అయితే.అనేక పరిణామాలను, అనేక దెబ్బలను చవిచూసిన జబర్దస్త్ రోజాకు ఇప్పుడు మరో కీలక సమస్య వచ్చిపడింది.
తననియోజకవర్గంలో తనకు తెలియకుండానే పనులు జరిగిపోతున్నాయి! ఎవరు చేస్తున్నారో తెలియదు ఎవరు చేయిస్తున్నారో అంతకంటే తెలియదు పోనీ జరిగితే జరిగాయి తన పేరు ఉంటోందా? అంటే ఎక్కడా రోజా పేరు మాత్రం కనిపించడం లేదు వినిపించడం లేదు దీంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నారు.పైగా నియోజకవర్గానికి ఇటీవల కాలంలో గెస్ట్గానే ఉంటున్నారనే విమర్శల నేపథ్యంలో సొంత ఇల్లు కట్టుకుని ప్రజలను మురిపించారు.
కానీ, ఇప్పుడు కూడా ఆమె గెస్ట్ మాదిరిగానే వస్తున్నారు.ఇది కూడా ఒక విధంగా ఆమెకు వ్యతిరేకంగానే ఉంది.ఇదిలావుంటే.నియోజకవర్గంలో వరుస విజయం తర్వాత.
రోజా వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని అంటున్నారు వైసీపీ సీనియర్లు.గతంలో ఏపనైనా చేయాలంటే.సీనియర్లను సంప్రదించి చేసేవారని.ఇప్పుడు మాత్రం తనకు నచ్చిన విధంగా చేసుకుంటున్నారని.నేరుగా సీఎంతోనే తనకు రెపో ఉందని చెబుతున్నారని కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఈ దూకుడుతో జిల్లాకు చెందిన కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.ఈక్రమంలోనే రోజాకు వ్యతిరేక వర్గం.గత ఏడాది ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రచారం చేసిన కేజే కుమార్ను పెద్దిరెడ్డి చేరదీశారు కుమార్ భార్యకు కార్పొరేషన్ పదవిని కూడా ఇప్పించారు ఇది.ఇప్పుడు మరిన్ని వివాదాలకు కారణంగా మారింది.రోజాకు యాంటీగా.
ఒక వర్గాన్ని మెయింటెన్ చేసుకునేందుకు పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం నిజమేనని అంటున్నారు.
అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు చెప్పుకుండానే కొందరికి పింఛన్లు మంజూరు చేయించడం, ఇంటింటికీ తిరిగిస్థానిక నేతలను పరిచయం చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.
వీటిపైనే రోజా తీవ్రస్తాయిలో విరుచుకుపడుతున్నారు.అయితే, ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతున్నవేనని రోజాను కట్టడి చేసేందుకు కుమార్ సతీమణిని అవసరమైతే వచ్చే ఎన్నికల్లో బరిలో దింపేందుకు కూడా పార్టీ సిద్ధంగానే ఉంటుందని అంతా పెద్దిరెడ్డిమహిమేనని అంటున్నారు.
దీంతో రోజాకు సెగ మామూలుగా లేదని అంటున్నారు.