ఈనెల 27వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం బాధితులతో భేటి కానున్నారు.విషయంలోకి వెళ్తే కొద్ది వారాల క్రితం ఇప్పటంలో రోడ్లు విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం .
ఆ గ్రామంలో కొన్ని కూల్చడం తెలిసిందే.ఈ క్రమంలో కూల్చివేతలో భాగంగా నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థిక సాయం పవన్ ప్రకటించడం తెలిసిందే.
దీంతో ఈనెల 27వ తారీకు మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో…ఇప్పటం బాధితులకు పవన్ కళ్యాణ్ స్వయంగా చెక్కులు పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు.
ఈ ఏడాది మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇవ్వటం జరిగింది.
దీంతో వైసిపి ప్రభుత్వం కక్షగట్టి జనసేన సభ ప్రాంగణం కోసం పొలాలను ఇచ్చిన వారిని టార్గెట్ చేసి.కక్ష సాధింపులకు పాల్పడుతూ ఇళ్నను కూల్చినట్లు.
పవన్ ఆరోపించడం జరిగింది.ఇదే సమయంలో ఇప్పటం గ్రామానికి చెందిన బాధితులను కూడా కలవటం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వారికి గతంలో ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఈనెల 27వ తారీకు పవన్ రెడీ కావటం జరిగింది.ఈ విషయాని పార్టీ అధికారికంగా ప్రకటించింది.