తెలంగాణాలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా పూర్తవ్వడంతో… ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కూడా… సానుకూలంగా ఉంది.ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ….
హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడం… ఇక ఆ తరువాత లోక్ సభ ఎన్నికలు కూడా ఉండడంతో… మరోసారి రాష్ట్రంలో సందడి సందడి నెలకొనబోతోంది.దీనిలో భాగంగానే… సంక్రాంతికి ముందే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు జనవరి 10లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు.రిజర్వేషన్ల ఖరారుకు సమయం కావాలని కోర్టును కోరినట్లు తెలిపారు.ఈ మేరకు ఈ నెల 27 నుంచి జనవరి 2 వరకు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు.
నోటిఫికేషన్ తర్వాత 15 రోజులకు తొలి విడత, 28 రోజులకు రెండవ విడత ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు
.