జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులు అవుతున్న ఇంత వరకు నూతన మేయర్ ఎవరనేది ప్రకటించలేదు తెలంగాణ ప్రభుత్వం.ఇప్పటికే ఈ విషయంలో ఇతర పార్టీ వర్గాల వారు విమర్శలు కూడా చేశారు.
అయితే తాజాగా జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో నూతన మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు.
ఇకపోతే డిసెంబర్లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.దీంతో ఎన్నికల్లో హడావుడి చేసిన అధికార పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడంలో చల్లబడింది.
ఇక ఈనెల 10వ తేదీతో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం కూడా ముగిసింది.
ఈ నేపధ్యంలో శుక్రవారం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారని, అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారని సమాచారం.