ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కు సర్వ బ్రాహ్మణ మహాసభ నోటీసులు పంపింది.చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా దీనిపై క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ప్రధాన పాత్రల రూపురేఖల పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే హిందూ దేవుళ్లను, దేవతలను తప్పుగా చూపించారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.