తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నిఖిల్ శర్వానంద్ వంటి వారు ఒకరు.వీరిలో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.
అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎన్టీఆర్ కొత్తడైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు.ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ రాజమౌళి వంటి వారు డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా ఎన్టీఆర్ సినిమాలతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ ఇద్దరు ప్రస్తుతం దర్శకులుగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇక కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి దర్శకులలో అనిల్ రావిపూడి, వశిష్ట, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అయితే కళ్యాణ్ రామ్ పరిచయం చేసినటువంటి ఈ దర్శకులు కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
యంగ్ హీరో అయినటువంటి నిఖిల్ సుధీర్ వర్మ దర్శకత్వంలో స్వామి రారా సినిమాకు దర్శకత్వం వహించారు.అలాగే చందు మొండేటి కార్తికేయ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించడంతో ఈ ఇద్దరు హీరోలకు ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉంది.
వీరితోపాటు హీరో శర్వానంద్ సైతం ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేశారు.
ఈయన హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో సుజిత్ దర్శకుడుగా పరిచయమయ్యారు.ప్రస్తుతం సుజిత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ నలుగురు హీరోలు కొత్త డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసినప్పటికీ వీరు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆదర్శకులు మాత్రం ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కొనసాగడం విశేషం.