మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.చిరంజీవి ఇంకా రాం చరణ్ లు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతున్నాట్లుగా మొదట ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు ఈ రీమేక్ కు వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కొత్త వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో వస్తోంది.అదేంటి అంటే ఈ సినిమాలో చిరుతో పాటు చరణ్ కాకుండా మరో మెగా హీరో నటించబోతున్నాడట.
చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.కనుగా లూసిఫర్ రీమేక్ లో ఆయన నటించడం కష్టం అయ్యింది.
అందుకే సినిమా లో మెగా హీరోను సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది.
మెగా ఫ్యామిలీ కి చెందిన ఆ హీరో చిరుతో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడట.దాంతో సమ్మర్ లో సినిమాను మొదలు పెట్టబోతున్నారు.చిరుతో నటించే అవకాశం దక్కించుకున్న ఆ మెగా హీరో ఎవరు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్.
సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆ యంగ్ మెగా హీరో ఎవరో తెలియనుంది.ఈ సినిమాను చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే.