సినిమా ఇండ్ట్రీలో హీరో, హీరోయిన్ గా ఎదగాలంటే ఎన్నో ఆగు బాటలు పడాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.ఇందులో కొంతమంది హీరో, హీరోయిన్స్ పాత్రలలో నటిస్తే మరికొందరు విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు.
ప్రస్తుత రోజులలో హీరోయిన్, హీరోలకు దీటుగా విలన్ క్యారెక్టర్ ను కూడా అలానే చూపించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.విలన్ గా నెగిటివ్ షేడ్స్ చూపించిన తరాల విషయానికి వస్తే…
అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రమ్యకృష్ణ .రమ్యకృష్ణ అందరి అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.ఆ సమయంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే రజనీకాంత్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన నరసింహ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో రమ్యకృష్ణ నటించిన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇప్పటికీ నీలాంబరిగా ప్రేక్షకుల మన్నను సొంతం చేసుకుంది.రమ్యకృష్ణ అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మేపిచేందుకు సిద్ధంగా ఉంటుంది.
సౌందర్య.ఈమె గురించి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించిన సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా ముందుకు కొనసాగింది.అలాగే అప్పట్లో సౌందర్య వెంకటేష్ జంటగా సినిమాలు వచ్చాయంటే ప్రేక్షకులు అందరూ ఆ సినిమాలను చూసేందుకు చాలా ఆతృతగా ఉండేవారు.హీరో శ్రీకాంత్ హీరోగా “మనసిస్తా రా” సినిమాలో సౌందర్య విలన్ పాత్రలో నటించింది.
ప్రేక్షకులు ఎప్పుడు సౌందర్యాలు మంచితనంగా చూసినవాళ్లు ఒక్కసారిగా విలన్ పాత్రలో చూడలేకపోయారు.
త్రిష.వర్షం సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.చిన్న చిన్న పాత్రలో నటిస్తూ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ ద్విపాత్రలో నటించిన ధర్మ యోగి సినిమా విలన్ పాత్రలలో నటించింది.
సమంత.ఎపుడు చక్కటి చిరునవ్వుకు.క్యూట్ స్పెషల్ తో యూత్ ని ఆకట్టుకునే సమంత హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, మరోవైపు తమిళ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించే మెప్పించింది.
రీమాసేన్.గ్లామర్ హీరో ఇమేజ్ కాకుండా ప్రధాన పాత్రల్లో కూడా రీమాసేన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాలో, శింబు తెరకెక్కించిన వల్లభ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
రాశి.నిత్యం సాంప్రదాయపు అమ్మాయి లాగా కనిపించే రాశిలో తనలో ఉన్న నెగిటివ్ రోల్ కూడా ఉంది అంటూ నిరూపించుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ సరసన రాశి విలన్ పాత్రలో అద్భుత నటన చేసింది.
వరలక్ష్మి శరత్ కుమార్.ఈ లిస్ట్ లో చివరిగా వరలక్ష్మి శరత్ కుమార్.ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఫిమేల్ విలన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.