టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ చాలావరకు తక్కువగా కనిపిస్తారు.ఇక ఈ మధ్య అసలే కనిపించడం లేదు.
మొత్తానికి టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ హవానే నడుస్తోంది.ఇప్పటికే బాలీవుడ్ నుండి ఎంతో మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు పరిచయం కాగా ఇకపై టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ క్రేజ్ మాత్రమే కనిపించనుంది.
పైగా టాలీవుడ్ సినిమాల విషయంలో కూడా మరింత క్రేజ్ పెరిగింది.ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేస్తున్నారు డైరెక్టర్లు.అంతేకాకుండా స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడ్డారు.పైగా హీరోయిన్స్ విషయంలో కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ లనే కోరుకుంటున్నారు.
ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహో తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పరిచయం అయ్యింది.
అంతేకాకుండా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.
అంతేకాకుండా ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, మరో ఐరిస్ బ్యూటీ నటిస్తున్నారు.ఇదిలా ఉంటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మరో బ్యూటీ జాక్వెలిన్, నిధి అగర్వాల్ లు నటించనున్నట్టు తెలుస్తోంది.
ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే అడవి శేష్ నటిస్తున్న సినిమాలో కూడా సాయి మంజ్రేకర్ కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే చిరంజీవి సినిమాలో కూడా మరో బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా బాలకృష్ణ సరసన సోనాక్షి సిన్హా ను హీరోయిన్ గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ఇక మొత్తానికి టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ వరుసగా క్యూ కడుతున్నారు.