దేశంలో అఘాయిత్యాలు ఆగడం లేదు.ప్రతి రోజు ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట అఘాయిత్యం జరుగుతూనే ఉంది.
ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగి పోతున్న ఈ సమయంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటీ అంటే సన్నిహితులే ఆడవారిపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు.ఇటీవల నోయిడాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది.
తెలిసిన వ్యక్తి రేప్ చేసేందుకు ప్రయత్నించాడు.అతడి నుండి అయిదుగురు యువకులు ఆమెను కాపాడారు.
అతడిని అక్కడ నుండి తరిమేశారు.ఆ తర్వాత ఆ అయిదుగురు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.నోయిడాకు చెందిన 21 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం అన్నయ్య స్నేహితుడిని కలిసింది.అతడు పార్క్కు రమ్మనగా అక్కడకు వెళ్లింది.అక్కడ అతడు తప్పుగా ప్రవర్తించడంతో ఆమె అరిచింది.
అతడికి బుద్ది చెప్పేందుకు అక్కడకు వచ్చిన అయిదుగురు అతడిని కొట్టి తరిమేశారు.ఆ తర్వాత ఆమెను అసలేం జరిగింది అంటూ ప్రశ్నించి ఆమెకు కాస్త ధైర్యం చెప్పారు.
అంతలోనే ఆ అయిదుగురు కలిసి ఆమెను సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు.ఆమె ఎంత మొత్తకున్నా వినకుండా పాశవికంగా తమ కోర్కెను తీర్చుకున్నారట.
యువతి ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి విచరణ జరుపుతున్నారు.