కలియుగంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఎదురు దాడులు.ఇప్పటికే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వైరస్ అంతం కాకముందే.
మరో వైరస్ విజృంభణ లో ఉంది.అంతేకాకుండా గత ఏడాదితో పోలిస్తే.
ఈ ఏడాది లో మరింత ప్రమాదం ఉందని నోస్ట్ర డామస్ భవిష్యవాణి లో తెలిపిన విషయం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది.
ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రాడామస్ 465 ఏళ్లక్రితం తెలిపిన భవిష్యవాణి లో ఉన్న ఘటనలు ఇప్పటివరకు పూర్తిగా జరిగినవే.
కాగా ప్రస్తుతం ఈ ఏడాది గురించి కూడా కొన్ని విషయాలు తెలపగా నిజంగానే ఏదో ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఇదిలా ఉంటే ఇది వరకు.
అమెరికా మాజీ అధ్యక్షుడు హత్య
గురించి,అమెరికా లో అతి పెద్ద భూకంపం, 9/11 ట్వీన్ టవర్స్ ఎటాక్ అంతేకాకుండా గత ఏడాది వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మింగేస్తుంది అన్నట్లు తన భవిష్యవాణి లో ఉందని తేలగా అవన్నీ నిజమే అయ్యాయి.
కాగా ఈ ఏడాది మరింత ఘోరంగా ఉందని తెలిపారు వర్షం, రక్తం, పాలు, కరువు దొంగతనాలు, ఓ మహమ్మారి వంటి ఘటనలు ఎదురవుతాయి అంటూ.అంతేకాకుండా కోట్లమంది పైగా చనిపోతారంటూ తన భవిష్యవాణి లో ఉన్నాయంటూ పలు విషయాలు తెలిపారు.తల్లులు, తండ్రులు చనిపోతారంటూ, ఆకాశం ఎర్రగా మారుతుందంటూ, కాంతివంతమైన తోక కిరణం ఆకాశం నుంచి భూమిపై పడుతుందని దానివల్ల ఎక్కడ చూసినా కరువు ఏర్పడుతుందని, ఐఫిల్ టవర్ సైజులో ఉన్న భారీ ఉల్క భూమి వైపు దూసుకొస్తుందని, తుఫానులు ఎక్కువగా వస్తాయంటూ భవిష్యవాణి లో ఉందని తెలిపారు.
దాదాపు ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ రాకముందే చాలా వరకు ప్రజలు వైరస్ నుండి తట్టుకునే శక్తిను పెంచుకున్నట్లు తెలిపారు.అదే శక్తి సామర్థ్యాలతో ఈ కరువు ను కూడా తట్టుకునే శక్తి ప్రజల్లో ఉంటుందనే విషయాన్ని తెలిపారు.