తెలుగు సినీ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయల్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.నటుడిగానే కాకుండా సంగీత నిర్మాతగా, రేడియో జాకీగా, టీవీ యాంకర్ గా ఇలా పలు రకాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని ఉన్నంత కాలం మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయన సినీ నటి ని పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.
2019 జనవరి లో సినీ నటి ఈస్టర్ నోరోన్హాను పెళ్లి చేసుకున్నాడు.ఇక వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అదే ఏడాది జూన్ లో విడాకులు దరఖాస్తు చేయగా అధికారికంగా కోర్టు నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించలేదు.
ఇక వీరి విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇక తాజాగా లైఫ్ లో తొలిసారి పశ్చాతాపపడుతున్నా అంటూ ఈస్టర్ కొన్ని పోస్ట్ లు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
ఎవరివల్ల మనం నవ్వు తాము వారి వెళ్ళినప్పుడు ఏడుస్తాం.గతంలో నవ్వుకున్న రోజులు తలుచుకుంటే కన్నీళ్లు వస్తుంటాయి.అప్పుడు నవ్వడం ఎంత కష్టమో.ఇప్పుడు కన్నీరు అంత చేదుగా అనిపిస్తాయని గతంలో తాను చేసిన దాని గురించి ఇప్పుడు పశ్చాతాపడుతున్నానని తెలిపింది.రిగ్రెట్ అంటే ఇప్పుడు తెలుసుకుంటాను అని మనుషుల విలువ, కాలం విలువ, జీవితం అనేది లాక్ డౌన్ తనకు నేర్పిందని తెలిపింది.ఎవరో ఏదో చెప్పారని వదిలేయకండని మీరు ప్రేమించిన వారికి మీ ప్రేమను చూపించండంటూ.
వారికి కావాల్సినవి అందించాలని తెలిపింది.
తర్వాత జీవితం ఎలా ఉంటుందో అది లేదనేలా జీవించండి అంటూ ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుపోతుంటాయని తెలిపింది.మంచి వ్యక్తి వద్ద చెడ్డ పనులు చేసినప్పటికీ కంటే తప్పుడు వ్యక్తి వద్ద ఉండి మంచి పనులు చేసినప్పుడు ఎక్కువగా పశ్చాత్తాపడాలని.ఇప్పుడున్న కాలంలో మనుషుల్ని నమ్మడం అనేది భయంగా మారిందంటూ తెలిపింది.
సరైన స్నేహితుడిని వెతుక్కోవాలని.జీవిత బంధాల్ని ఆటంకంగా మారని వద్దంటూ.
చెడ్డ వ్యక్తుల కంటే మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి ఉంటే చాలు అని తెలిపింది.ఎవరో చెడ్డ వ్యక్తి వల్ల ఇతరుల మీద నమ్మకం పోనివద్దని మంచి వారిని కోల్పోకుండా చూసుకోమని తెలిపింది.
తన జీవితంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి అనుభవిస్తున్నానని.తనకు గుణపాఠం జరిగిందని దాంతో అందరితో పంచుకోవాలని తెలిపింది.ఏది మనకు దక్కదని ఆ క్షణాలు అనుభవించాలని.ఈ ప్రపంచంలో మంచి వ్యక్తితో నిజమైన స్నేహం కంటే స్వచ్ఛమైనది ఏదీ లేదని తెలిపింది.ఇక ఈ పోస్టులు చూసిన నెటిజనులు నోయల్ గురించి ఆలోచిస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు ఇటీవల తన స్నేహితుడు మరణించాడని అందుకే అలా పోస్టులు చేస్తుందని అంటున్నారు.