తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్లో ఎనిమిదో వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ వారం లాస్య, మోనాల్, అఖిల్, మెహబూబ్, అరియానా, అమ్మ రాజశేఖర్ నామినేషన్లో ఉండగా.
వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.ఇదిలా ఉంటే.
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ప్రతి వారంలాగానే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు.అదే బీబీ డే కేర్ టాస్క్.
ఈ టాస్క్లో పిల్లలు, కేర్ టేకర్స్గా ఇంటి సభ్యులు విడిపోవాల్సి ఉంటుంది.కేర్ టేకర్స్ చేయాల్సిన పని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.
వాళ్లకు కావాల్సింది చేసి పెట్టడం, బట్టలు మార్చడం వంటివి చేస్తూ ఉండాలి.ఈ టాస్క్లో నోయల్, అఖిల్, సోహెల్, మోనాల్, అభిజీత్లు కేర్ టేకర్స్గా.
అవినాష్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, హారికలు పిల్లలుగా వ్యవహరించారు.అయితే ఎంతో సరదాగా జరిగిన ఈ టాస్క్లో నోయల్ సరిగ్గా పాల్గొనలేకపోయారు.
అందుకు కారణం అతడి ఆరోగ్య పరిస్థితి.ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో నోయల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా చూపించారు.ఆయన మెడికల్ రూంకు సైతం వెళ్లాడు.అనంతరం భుజాలు కదలడం లేదని, కాళ్లు నడవడానికి కూడా రావట్లేదని, రాత్రి నిద్ర కూడా పట్టలేదని నోయల్ అభిజిత్కు చెబుతూ తెగ బాధపడ్డాడు.
ఈ క్రమంలోనే బాగా డీలా పడిపోయిన నోయల్ను బీబీ డే కేర్ టాస్క్ నుంచి తొలిగించి.రెస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.దీంతో నోయల్ స్థానంలో అవినాష్ బాధ్యతను కూడా అభిజితే చూసుకున్నాడు.అయితే నోయల్ ఆరోగ్య స్థితిపై ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
నోయల్ త్వరగా కోలుకుని.యాక్టివ్ మోడ్లోకి రావాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇక బీబీ డే కేర్ టాస్క్లో చివరకు బాగా అల్లరి చేసిన అరియానా మరియు తనను ఎన్ని ముప్ప తిప్పలు పెట్టినా తట్టుకున్న సోహైల్ను విజేతలుగా లాస్య నిర్ణయించింది.