నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.రెండు భిన్న కాలాలలో జరిగిన కథాంశంతో ఈ మూవీని దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్నాడు.
నాని కూడా రెండు భిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.ఇక సాయి పల్లవి మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.
అలాగే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నానికి జోడీగా సందడి చేయబోతుంది.లాక్ డౌన్ సడలింపు తర్వాత రీసెంట్ గా మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
సౌత్ లో అన్ని బాషలలో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై నాని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే టైటిల్ తో ఒక సినిమాని ఈ ఏడాది ఆరంభంలోనే ఎనౌన్స్ చేశారు.
మార్చిలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది.ఇక మలయాళీ బ్యూటీ నజ్రియా ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.ఆమె కూడా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆమె సడెన్ గా కేరళ వెళ్ళిపోయింది.
ఇక నాని కూడా ఆ మూవీ షూటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలించి షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చారు.
సుందరం సినిమా ఊసే ఎత్తకుండా నాని నేరుగా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ లో జాయిన్ అయిపోయారు.ఈ నేపధ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీకి సంబందించిన అప్డేట్ కోసం నాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇంతని అంటే సుందరానికి అంటూ నాని మొదలు పెడుతున్నాడా లేదా కంప్లీట్ గా పక్కన పెట్టేసాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.