అక్రమ సంబంధాలు ఒకసారి కాకున్నా ఒకసారి అయినా బయట పడతాయి, వాటి వల్ల గొడవలు అవుతాయని పదే పదే చెబుతున్నా, పలువురి విషయాల్లో దుఖ: మిగుల్చుతున్నా కూడా జనాలు మాత్రం అక్రమ సంబంధాలను వదలడం లేదు.అత్యంత దారుణమైన అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు కోల్పోయే వారు, హత్య చేయబడుతున్న వారు కొన్ని వందల మంది ఉంటున్నారు.
అయినా కూడా అక్రమ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా అక్రమ సంబందం వల్ల తమిళనాడులో ఇద్దరు మృతి చెందారు.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లే ఆశ్చర్యకర విషయాలు వెళ్లడి అయ్యాయి.ఆమెకు ఇలా జరగాల్సిందే అని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం పాపం అంటున్నారు.
తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన జరిగింది.స్థానిక 54 ఏళ్ల వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.
ఆ ముసలాయనకు పిల్లలు, మనవరాలు కూడా ఉంది.భార్య లేకపోవడంతో పెళ్లి అయిన 25 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ముసలాయన డబ్బు మరియు సుఖం ఇస్తున్న కారణంగా భర్త, బిడ్డ ఉన్నా కూడా సంబంధం కంటిన్యూ చేసింది.
ఆ ముసలి వ్యక్తి ఆమె వ్యామోహంలో పూర్తిగా పడిపోయాడు.ఆమెకు బానిస అయ్యాడు.ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
పెళ్లి చేసుకుంటే ఆమెకు మరింత దగ్గరగా ఉండవచ్చు అని భావించాడు.కాని ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
వయసు రీత్యా మన పెళ్లి సాధ్యం కాదు అంటూ తేల్చి చెప్పింది.గత కొన్ని నెలలుగా పెళ్లి కోసం ఒప్పిస్తున్నాడు.
ఆమె ఒప్పుకోక పోగా, అతడికి దూరంగా ఉంటుంది.దాంతో కోపంతో ఒక పెద్ద కత్తితో ఆమె ఇంటికి వెళ్లి తల నరికాడు.
ఆమె అరుపులతో చుట్టు పక్కల వారు వచ్చారు.తలుపులు బద్దలు కొట్టి చూసేప్పటికి రక్తపు మడుగులో చనిపోయి ఉంది.
ఇక ఆ ముసలి వ్యక్తి వెనుక డోర్ నుండి పారిపోయాడు.ఆ పక్కనే ఉన్న చెట్లలో ఉరి వేసుకుని చనిపోయాడు.
అలా ఇద్దరి జీవితాలు అర్థాంతరంగా అక్రమ సంబంధం కారణంగా ముగిసి పోయాయి.