యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత నటిస్తున్న మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ మొదలై చాలా నెలలు అవుతున్నా, ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్తో మాత్రమే సరిపెట్టారు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తు్న్నారు ఆడియెన్స్.అయితే సంక్రాంతి పండుగ కానుకగా మిగతా హీరోలు తమ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు.కానీ రాధేశ్యామ్ చిత్రం నుండి మాత్రం సంక్రాంతి కానుకగా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్తో వస్తున్న ప్రభాస్ సినిమా నుండి పండుగకు టీజర్ను రిలీజ్ చేస్తారేమో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశించారు.కానీ ఈసారి కూడా వారి ఆశలపై రాధేశ్యామ్ చిత్ర యూనిట్ నీళ్లు జల్లిందని చెప్పాలి.
ప్రభాస్, పూజా హెగ్డేలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఓ మోషన్ పోస్టర్ మినహా రాధేశ్యామ్ నుండి ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడమే దీనికి కారణం.
కాగా ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ ఇటీవల రాధేశ్యామ్ టీజర్ గురించి ఓ ట్వీట్ చేశాడు.
టీజర్ను రెడీ చేస్తున్నామని, తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్ధమే ఇది అనే రేంజ్లో ఆయన ఈ టీజర్ గురించి చెప్పుకొచ్చాడు.కానీ పండుగ సమయంలో అందరు హీరోలు ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లతో దుమ్ములేపుతుంటే రాధేశ్యామ్ నుండి తుఫాన్ కాదు కదా కనీసం వాన చినుకులు కూడా లేవని సెటైర్లు వేస్తున్నారు.
ఏదేమైనా రాధేశ్యామ్ చిత్ర యూనిట్ మరింత ఆలస్యం చేయకుండా తమ అభిమానుల కోసమైనా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేస్తే బాగుంటుందని, వారిని మరింత వెయిట్ చేయించడం అసలుకే ఎసరు పెట్టవచ్చని పలువురు సినీ క్రిటిక్స్ అంటున్నారు.మరి రాధేశ్యామ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే ప్రశ్నకి ప్రస్తుతానికి సమాధానం లేదనే చెప్పాలి.