తెలంగాణ అధికార పార్టీలో ఇప్పుడు వింత పరిస్థితి కనిపిస్తోంది.నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు.
ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడినా మాట్లాడుకునే పరిస్థితి లేదు.ఈ వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్ ఇటు అధికార వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ పొలిటిషిన్ రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలిచి డబల్ హ్యాట్రిక్ కొట్టిన నాయకుడు.ఇదే జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య చాలా కాలంగా మాటల్లేవు.
ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే కాకుండా ఒకే నియోజకవర్గం వారు కావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
తనకంటే జూనియర్ అయిన సత్యవతి రాథోడ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినా మంత్రి పదవి రావడంతో తీవ్ర ఆగ్రహంతో రెడ్యా నాయక్ ఉన్నారు.
ఓ సందర్భంలో మంత్రి ఎమ్మెల్యే ఒకరికొకరు ఎదురుపడినా కనీసం పలకరించుకోకుండా ఎడ ముఖం పెడముఖం గా వెళ్లిపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.