కాణిపాకం ఆలయ ఈవోపై సస్పెన్షన్ వేటు..!

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వ‌రసిద్ధి వినాయ‌క ఆల‌య ఇంచార్జీ ఈవో సురేశ్ బాబుపై ఏపీ ప్ర‌భుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.అనంతరం ఆయ‌నకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

 No Suspension On Kanipakam Temple Evo..!-TeluguStop.com

అదే విధంగా సురేశ్ బాబు స్థానంలో ఆల‌యానికి ఈవోగా రాణా ప్ర‌తాప్‌ను నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రెండు రోజుల క్రితం కాణిపాకం ఆల‌యంలో అభిషేకం టికెట్ ధ‌ర‌ను రూ.700ల నుంచి రూ.5వేల‌కు పెంచుతూ సురేశ్ బాబు నోటిఫికేష‌న్ జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా విమ‌ర్శ‌లు వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో సురేశ్ బాబు ఇచ్చిన నోటిఫికేష‌న్‌ను రద్దు చేస్తూ దేవాదాయ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ఈ వ్య‌వ‌హారంలో బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఆయనపై బదిలీ వేటు వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube