ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదు.రాదు.
ఈ విషయం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసారు.ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పారు.
హోదా కోసం పట్టుపట్టవద్దని సహాయం చేయడమే ప్రధానమని అన్నారు.ఏపీ ఆర్ధిక లోటు పూడ్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇది అతి తొందరలోనే జరుగుతుందని అన్నారు.ప్రత్యేక హోదాకు మించిన సహాయం అందచేయడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రత్యేక హోదా పేరు లేకపోయినా నిరంతరం అంటే కొన్నేళ్ళ పాటు సాయం చేస్తామన్నారు.కేంద్రం చేసే సాయం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఉంటుందని చెప్పారు.
ఆర్ధిక లోటు తగ్గిస్తామని, కొత్త ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని, రాజధాని నిర్మాణానికి డబ్బు ఇస్తామని, ఏది కావాలంటే అది ఇస్తామని పెద్ద ఆశలు పెట్టారు.కాని ప్రత్యేక హోదా కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేసారు.
.