బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రోతేలా టాలీవుడ్ లోకి బ్లాక్ రోజ్ అనే మూవీతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.సంపత్ నంది అందించిన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా మోహన్ భరద్వాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ఆ మధ్య లాంచ్ చేశారు.అలాగే ఇందులో ఊర్వశీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు.
తెలుగు, హిందీ బాషలలో తెరకెక్కే ఈ మూవీథ్రిల్లర్ కథాంశంతో షేక్స్ పియర్ ది మర్చన్ ఆఫ్ వెనిస్ నవలలో షైలాక్ అనే క్యారెక్టర్ స్ఫూర్తితో కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
డబ్బు ప్రధానంగా ఈ కాన్సెప్ట్ ఉంటుందని టాక్.
ఇదిలా ఉంటే అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభించిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎలాంటి టాక్ లేకపోవడం గమనార్హం.ఈ నేపధ్యంలో సినిమా ఇప్పటికే ఆగిపోయిందని, అందుకే అతను తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ పెట్టి బ్లాక్ రోజ్ ని పక్కన పెట్టాడని టాక్ నడుస్తుంది.
అలాగే ఊర్వశీ కూడా టాలీవుడ్ ఎంట్రీ గురించి అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకొని ఇప్పుడు సైలెంట్ అయిపోవడం చూస్తూ ఉంటే సినిమాకి సగంలోనే శుభం కార్డు వేసేసి ఉంటారని ఫిలిం నగర్ సర్కిల్ లో మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం సంపత్ నంది గోపీచంద్ తో తెరకెక్కించిన సిటీమార్ సినిమా రిలీజ్ చేసిన వెంటనే మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
అలాగే ఊర్వశీ రౌతేలా హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.