విజయవాడలో జరిగే కృష్ణా పుష్కరాలకు వెళ్తే తిరిగి రావటం ఎలా? ఇప్పటి నుంచే బస్సుల రిజర్వేషన్లు చేయించుకోవాలని చూస్తున్నారా? అదేం అవసరం లేదంటున్నారు ఆర్టీసి అధికారులు.నిజమే పుష్కర స్నానం ఇతర హడావిడి చివరకి రిజర్వేషన్ చేసుకున్న బస్సు సమయానికి మనం చేరక పోవటం ఇవన్నీ గోదావరి పుష్కరాలలో పడిన బాధలే.
ఈ బాధల్ని గుర్తించిన ఏ పి ఎస్ ఆర్టీసి, విజయవాడ నుంచి తిరిగి వెళ్లాలి్సన.షెడ్యూల్ ప్రకారం ఉన్న ఆర్టీసీ సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేస్తున్నట్టు ప్రకటించింది.
గోదావరి పుష్కరాలలో రిజర్వేషన్ ఉన్నా సమయానికి అందుకోలేక నగదును కోల్పోయారు.దీనికి తోడు కొందరు రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసుకోవటంతో సంస్ధ డబ్బు వాపస్ ఇవ్వాల్సి వచ్చింది.
తిరిగి ఆ తరహా సమస్య పునరావృత్తం కాకుండా రిజర్వేషన్ సౌకర్యం ఎత్తివేసినట్లు అధికారులు చెప్తున్నారు.ఆర్టీసీ షెడ్యూల్ ప్రకారం నడిచే సర్వీసుల్ని కొనసాగిస్తునే అదనపు సర్వీసులు నడుపుతామని, ప్రతి బస్సుకూ కరెంట్ రిజర్వేషన్ అవకాశం కల్పిస్తున్న ట్టు తెలిపారు.
ఆగస్టు 11వ తేదీ అర్థరాత్రి వరకు మాత్రమే విజయవాడ నుంచి బయలు దేరే బస్సులకు రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు.కరెంట్ రిజర్వేషన్ల కోసం ఆర్టీసీ ఎక్కడికక్కడ టెర్మినల్స్ను ఏర్పాటు చేసింది.
బస్టాపులలోనే కరెంటు రిజర్వేషన్ దొరికేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.