దేశంలో రానున్న ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం)ని ఉపయోగించే యోచన లేదని, నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) ఓటర్ల వినియోగానికి కూడా దీనిని ప్రతిపాదించడం లేదని భారత ప్రభుత్వం శుక్రవారం లోక్సభకు తెలియజేసింది.వచ్చే ఎన్నికల్లో ఆర్వీఎంను ఉపయోగించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించలేదని న్యాయ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఎన్ఆర్ఐ ఓటర్లకు ఆర్వీఎంను ప్రతిపాదించడం లేదని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది.
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), పోల్ ప్యానెల్ సాంకేతిక నిపుణుల కమిటీ సహాయంతో ఎలక్షన్ కమిషన్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మోడల్ను అభివృద్ధి చేసింది.రిమోట్ ఓటింగ్ ద్వారా దేశీయ వలసదారుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని పెంచేందుకు EC అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు కాన్సెప్ట్ నోట్ను కూడా పంపిణీ చేసింది.
అయితే ఆర్వీఎం ప్రవేశపెట్టడం వల్ల నకిలీ ఓట్లు పెరగవని రిజిజు స్పష్టం చేశారు.ఎందుకంటే ఆర్వీఎం ప్రొటోటైప్ పటిష్టంగా, ఇప్పటికే ఉన్న ఈవీఎంల ఆధారంగా తయారు చేయడం జరిగింది.కాగా రిమోట్ ఓటింగ్ ప్రతిపాదన పురోగతిలో ఉందని, దానిని నిర్ణయించడం అంత తేలికైన విషయం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.
రిమోట్ ఓటింగ్పై ఇటీవల జరిగిన అఖిలపక్ష సంప్రదింపులు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు పాల్గొనడంతో విజయవంతమయ్యాయని కూడా ఆయన చెప్పారు.కాగా గత లోక్సభ ఎన్నికలలో పాల్గొనని పట్టణ ఓటర్లు, యువత, స్వదేశీ వలసదారులతో సహా 30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని లోక్సభలో గుర్తు చేసుకోవడం జరిగింది.