మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో తేజు తనదైన మార్క్ వేసుకోవడానికి మరోసారి రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను ఇప్పటికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
కాగా ఈ సినిమాలోని నో పెళ్లి పాటను ఇటీవల రిలీజ్ చేసింది.
ఈ పాట చాలా క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ పాటను విపరీతంగా ఆదరిస్తున్నారు.
ఈ పాట బ్యాచ్లర్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని భావించిన యూత్, ఈ పాటను అదే పనిగా చూస్తున్నారు.దీంతో యూట్యూబ్లో ఈ పాటకు అదిరిపోయే వ్యూస్ వచ్చిపడుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ పాటకు ఇప్పటివరకు ఏకంగా 10 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.ఈ పాటను థమన్ చాలా క్యాచీగా ట్యూన్ చేయడంతో ఈ పాటకు విశేష స్పందన లభించింది.
ఇక ఈ పాటలో రానా దగ్గుబాటి, వరుణ్ తేజ్లు కూడా కనిపించడంతో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాను సుబ్బు డైరెక్ట్ చేస్తుండగా బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.