వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఓ వీడియో విడుదల చేశారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి తనను ఎవ్వరూ టచ్ చేయలేరని పేర్కొన్నారు.ఏ స్టుపిడ్ కోర్టు తనను ప్రాసిక్యూట్ చేయలేదని, తానే పరమశివుడినని.
తాను నిజం చెప్పగలను.తన నిజాయితీని నిరూపించుకోగలనంటూ వీడియోలో చెప్పారు.
అయితే, అది ఎక్కడ.? ఏ సందర్భంలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.కానీ, ఆ వీడియో మాత్రం వైరల్గా మారిపోయింది.ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి.నిత్యానందపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి.లెక్కలేనన్ని వివాదాలున్నాయి.
అయితే నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది.ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది.