టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోల మద్య తీవ్ర పోటీ ఉండేది.అయితే ఆ పోటీ ఆరోగ్యకర పోటీ అయితే కాదని చెప్పుకోవచ్చు.
ఒకరిపై ఒకరు డామినేషన్ ప్రదర్శించడం, తమ సినిమాలు రికార్డు సాధించాయి అంటే తమ సినిమాలు రికార్డులు దక్కించుకున్నాయి అంటూ ఒకరిపై ఒకరు పై చేయి కోసం తెర వెనుక విశ్వ ప్రయత్నాలు చేసేవారు.పైకి సాదారణంగా కనిపించినా కూడా లోలోపల మాత్రం రికార్డుల విషయంలో స్టార్ హీరోల మద్య ఈగో ఎక్కువగా ఉండేది.
గతంలో ప్రతి సినిమా కూడా ఇన్ని రోజులు ఆడినది, ఇన్ని థియేటర్లలో ఆడినది, ఇన్ని కలెక్షన్స్ సాధించింది అంటూ ప్రచారం చేసేవారు.
ప్రస్తుత పరిస్థితి మారింది, ప్రస్తుత స్టార్ హీరోల మద్య పోటీ అయితే ఉంది కాని అది ఆరోగ్యవంతమైన పోటీ.స్టార్ హీరోలు ఒకరి సినిమాను ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడం, ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరు కావడం వంటివి చేస్తున్నారు.ఇక రికార్డులు, కలెక్షన్స్ కూడా హీరోలు పట్టించుకోవడం లేదు.
ఆ విషయాలను నిర్మాతలు కాస్త అత్యుత్సాహం చూపిస్తూ రికార్డులు అంటూ వేసుకుంటున్నారు.అంతే తప్ప హీరోలు మహేష్బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
తాజాగా అదే విషయాన్ని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.ఇండస్ట్రీలో అంతా కూడా చాలా స్నేహంగా ఉంటాం.ఒకరి సినిమాలను ఒకరు చూసుకుంటాం.మా మద్య పోటీ ఉన్నా అది స్నేహపూర్వక పోటీ అంటూ చెప్పుకొచ్చాడు.
తానే గొప్ప అనే విధంగా పోస్టర్లపై కలెక్షన్స్ను ముద్రించడం మంచి పద్దతి కాదని, ఇకపై తన సినిమాలకు కలెక్షన్స్ను, నంబర్స్ను పోస్టర్లపై ముద్రించవద్దని నిర్మాతలకు చెబుతాను అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ ఇటీవల నటించిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా 205 కోట్లను వసూళ్లు చేసింది అంటూ ఆ మద్య పోస్టర్స్ వేశారు.ఆ తర్వాత భరత్ అనే నేను కూడా అదే విధంగా వేశారు.
ఇలా పోస్టర్స్ వేసి హీరోల మద్య మరియు వారి ఫ్యాన్స్ మద్య దూరం పెంచడం చేస్తున్నారని, అందుకే ఇకపై తన సినిమాల పోస్టర్లపై నంబర్లు వేయించను అంటూ చెప్పుకొచ్చాడు.ఈ విషయమై నిర్మాతలతో తాను మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు.ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.
రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం అభినంద నీయం అంటూ సినీ వర్గాల వారు ప్రశంసిస్తున్నారు.