“నీ భర్త కంటే బాగా చదువుకున్నావు.ఉద్యోగం చేయగలవు.
ఇక నీకు భరణం ఎందుకు? భర్త మీద ఎందుకు భారం మోపాలనుకుంటున్నావు? ఏదైనా ఉద్యోగం చూసుకో.కావాలంటే ఉద్యోగం పొందేందుకు ఆయన సహకారం తీసుకో” అని ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి రేఖా రాణి ఓ మహిళకు సలహా ఇచ్చారు.ఉద్యోగం సంపాదించుకునేంత వరకూ ఆమె ఖర్చుల నిమిత్తం నెలకు రూ.12 వేల చొప్పున ఏడాది పాటు చెల్లించాలని ఆదేశించారు.అంతకుముందు ఈ జంటకు విడాకులు మంజూరు కాగా, ఆమె తనకు భరణం ఇప్పించాలని డిమాండ్ చేసింది.దీంతో కోర్టు ఉద్యోగం చేసుకోవాలని సలహా ఇవ్వగా, ఉద్యోగం వచ్చేంత వరకూ భర్త తనతో పాటు తిరగాలని కోరింది.
ఈ అభ్యర్థనకు అంగీకరించని న్యాయమూర్తి, ఇక్కడికి ఒంటరిగా వచ్చినదానివి, ఇంటర్వ్యూకు ఎందుకు వెళ్లలేవని ప్రశ్నించారు.మాజీ భర్తకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ పంపి సాయం తీసుకోవచ్చని తెలిపారు.