డేగ అనే తెలుగు సినిమాలో నటించినా ఆ తర్వత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించింది ప్రగ్యా జైశ్వాల్.అయితే క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన కంచె సినిమాతో మాత్రమే అమ్మడికి క్రేజ్ వచ్చింది.
ఆ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అప్పటినుంచి అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి.
అయితే యువ హీరోల సరసన నటించినా సరే అమ్మడికి పెద్దగా లక్ కలిసి రాలేదు.అందుకే నాగార్జున, బాలకృష్ణ వారి సరసన కూడా నటించింది ప్రగ్యా జైశ్వాల్.
బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ అఖండ లో నటించినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు.అంతకుముందు కమిట్ మెంట్ ఇచ్చిన మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా తప్ప ఆమెకు మరో అవకాశం రాలేదు.
ప్రస్తుతం అమ్మడు చేతిలో సినిమాలేవి లేక ఖాళీగా ఉంది.ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేసేందుకు రెడీగా ఉన్న ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్ షో విషయంలో కూడా అదరగొట్టేందుకు రెడీ అంటుంది.
అందం, అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదని చెప్పాలి.ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడం వల్ల ఆమె కెరియర్ ఇలా డైలమాలో పడ్డదని చెప్పొచ్చు.
ప్రగ్యా జైశ్వాల్ కి ఇప్పటికైనా ఓ మంచి ఛాన్స్ వస్తే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.ఇచ్చిన ఎలాంటి పాత్రనైనా తన మార్క్ చూపించే సత్తా ఉన్నా సరే అమ్మడికి ఛాన్సులు రావట్లేదు.
అఖండ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అసలైతే రెండు మూడు ఆఫర్లు రావాలి కానీ ప్రగ్యా జైశ్వాల్ కి అలాంటి అవకాశాలు ఏవి రాలేదు.అయితే అమ్మడు మాత్రం వచ్చిన ప్రతి సినిమాను చేయకుండా సెలెక్టెడ్ గానే చేయాలని అనుకుంటుందని తెలుస్తుంది.