ఆంధ్రప్రదేశ్ లో కుప్పం అసెంబ్లీ పరిధిలో నక్కనపల్లి గ్రామం ఒకప్పుడు కళకళ లాడిపోతుండేది .ఇప్పుడు వెలవెల పోతూ కనిపిస్తోంది .
అక్కడ పంటలకు నెలవుగా ఉన్న రోజులు కాస్తా కరిగి పోయాయి .ఇప్పుడు రైతాంగం పొట్టచేతబట్టుకుని వలస బాట పట్టారు .అక్కడ మొత్తం 130 కుటుంబాలుండేవి.700 మందికి పైగా జనాభా ఉండేది.2,500 ఎకరాల సాగు భూములుండేవి.టమోటా, తమలపాకులు, బీన్సు, వేరుశనగ, రాగులు, వరి, చెరుకు, మిరప, ఉలవలు, జొన్నలు, మామిడి వంటి పంటలూ ఉత్సాహంగా వేసేవారు.
పంటల ద్వారా వచ్చిన ఆదాయంతో రైతులు మిద్దెలు కట్టుకున్నారు.అక్కడ ప్రతి ఒక్కరు తమకున్నంతలో మేడలు నిర్మించుకున్నారు.గ్రామంలో ఒక్క గుడిసె కూడా కనిపించని పరిస్థితి కాస్తా కరిగిపోయింది మూడేళ్లుగా కరువు విలయాన్ని సృష్టించడం తో ఒకనాడు కళకళలాడిన పల్లె నేడు బీడుగా మారిపోయింది .పలు కుటుంబాలు వలసెళ్లిపోయాయి.ఇలాంటి దీన రైతులు కుప్పం నియోజకవర్గంలో కోకొల్లలు చంద్రబాబు కుప్పం చుట్టుతా గ్రామాలకు నీటి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడ పలు గ్రామాలవారు కోరుతున్నారు