మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి భారీ అంచనాల నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకుడు వంశీ పైడిపల్లి అంటున్నాడు.
ఈ చిత్రంకు దాదాపుగా 135 కోట్ల బడ్జెట్ను పెట్టినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.దాంతో ఈ చిత్రం విడుదల అయిన రెండు వారాల పాటు టికెట్ల రేట్లు పెంచాలనే నిర్ణయాకికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు టికెట్ల రేటు విషయమై కూడా పబ్లిసిటీ చేస్తున్నారు
తెలంగాణ మంత్రి తాజాగా మహర్షి చిత్రంకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించలేదని, అసలు అలాంటి ప్రతిపాధన ఏదీ తమ వద్దకు రాలేదు అంటూ మంత్రి క్లారిటీ ఇచ్చాడు.ఏపీలో కూడా కలెక్టర్లు సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించారు అంటూ చెబుతున్నారు.
కాని అది కూడా నిజం కాదట.ఏపీలో కూడా కలెక్టర్లు సినిమా టికెట్ల రేట్లు పెంపుకు అనుమతించలేదని అంటున్నారు.
అంటే సినిమా టికెట్ల రేట్లు చాలా కామన్గానే ఉండబోతున్నాయన్నమాట.టికెట్ల రేట్లు పెరగడం వల్ల చాలా మంది సినిమాను చూడాలనుకున్న వారు నిరుత్సాహపడ్డారు.అయితే సినిమా టికెట్లు పెంచలేదని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు
సినిమా టికెట్ల రేట్లు 30 నుండి 50 శాతం పెంచడం వల్ల భారీగా లాభాలు దక్కించుకోవాలని నిర్మాతలు ప్రయత్నించారు.అందుకోసం ముందస్తు జాగ్రత్తగా టికెట్ల రేట్లు పెంచినట్లుగా ప్రచారం జరిపారు.అయితే ప్రభుత్వం వారు అనుమతించకపోవడంతో ఇప్పుడు వెనక్కు తగ్గారు.సినిమాకు ఏమాత్రం రేట్లు పెరగలేదని, ప్రేక్షకులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదని తేలిపోయింది.ప్రభుత్వాలు ఈ చిత్ర నిర్మాతలకు షాక్ ఇచ్చాయి.టికెట్ల రేట్లు పెరగక పోతే వెంటనే లాభాలు రావడం కష్టమే అంటున్నారు.