టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్స్టోరి సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఫిదా తరువాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు.
కాగా ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు సినిమా షూటింగ్లన్నీ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
కానీ లవ్ స్టోరి చిత్రం షూటింగ్ మాత్రం వాయిదా వేయకుండా చిత్ర యూనిట్ నిర్వహిస్తున్నారు.చైతూ, సాయి పల్లవిలపై పలు కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారట.
మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తమపై ఏమాత్రం లేదని చెబుతోంది లవ్ స్టోరి యూనిట్.
ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.