యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా, ఇందులో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని తొలుత భావించినా అది సాధ్యపడలేదు.దీంతో ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేశాడు.
కానీ ఇప్పుడు అది కూడా వీలు కాదని తెలుస్తోంది.ఇంకా సినిమా షూటింగ్ మిగిలి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అటు తారక్ త్రివిక్రమ్తో చేయబోయే సినిమాను వేసవిలో ప్రారంభించిన ఈ ఏడాది చివరినాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు.
కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదాతో ఇప్పుడు త్రివిక్రమ్తో చేయబోయే సినిమా కూడా మరింత ఆలస్యం కానుంది.
దీంతో 2021లో తారక్ డబుల్ ట్రీట్ ఇక లేనట్లే అని ఆయన ఫ్యాన్స్తో పాటు చిత్ర వర్గాలు కూడా నిరాశకు లోనవుతున్నాయి.ఏదేమైనా 2021లో తారక్ డబుల్ ట్రీట్పై బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కు తీవ్ర నిరాశే మిగిలింది.
త్రివిక్రమ్తో చేయబోయే ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని ఇప్పటికే అధికారికంగా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.