యంగ్ హీరో నిఖిల్కు సోలో హీరోగా అదిరిపోయే హిట్ ఇచ్చిన చిత్రం కార్తికేయ.చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి జనాలు బ్రహ్మరథం పట్టారు.
కంటెంట్లో దమ్ముంటే చిన్నాపెద్ద హీరోతో పనిలేకుండా సక్సెస్ కొట్టొచ్చనే విషయాన్ని ఈ సినిమా రుజువు చేసింది.ఆ తరువాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తన కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు హీరో నిఖిల్.
అయితే కార్తికేయ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉందని ఎప్పటినుంచో వస్తున్న వార్తలను ఇటీవల దర్శకుడు చందు మొండేటితో పాటు హీరో నిఖిల్ కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమాను ఇప్పటికే సెట్స్పైకి తీసుకెళ్లిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
కార్తికేయ సినిమాలో నటించిన కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి, కార్తికేయ సీక్వెల్లో కనిపించదని తెలుస్తోంది.ఈ సీక్వెల్ సినిమాలో హీరోయిన్గా నటించాలని మలయాళీ గుమ్మ అనుపమ పరమేశ్వరన్ను చిత్ర యూనిట్ అడిగినట్లు తెలుస్తోంది.
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.కార్తికేయ మొదటి భాగం సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ మూవీ ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ప్రొడ్యూ్స్ చేస్తున్నారు.