హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచారాన్ని ఘనంగా ముగించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.ప్రతి ఒక్క పార్టీ గెలుపు దిశగా పయనించేందుకు తమ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలుపరిచేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.
అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి నేతలు హుజూరాబాద్ లో జోరుగా ప్రచారంలో పాల్గొంటూ టీఆర్ఎస్ పై మాటల తూటాలు పేలుస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇక మరికొన్ని రోజుల్లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండడంతో కెసీఆర్ బహిరంగ సభ నిర్వస్తారని టీఆర్ఎస్ పార్టీ స్వయంగా తెలిపిన పరిస్థితి ఉంది.
అయితే ఈ సభను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని టీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే దళిత బంధును అడ్డుకున్నారు ఇప్పుడు దళిత బాంధవుడిని అడ్డుకుంటున్నారా అంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
ఎలక్షన్ కమీషన్ కి ఫిర్యాదు చేసి శాంతిభద్రతల సమస్యలు వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సభకు అనుమతిని నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని టీఆర్ఎస్ కీలక నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ హాజరుకాబోయే హుజూరాబాద్ సభను ఎవరూ అడ్డుకోలేరని, బీజేపీ తన శాయశక్తులా అడ్డుకునేందుకు ప్రయత్నించాలని కెటీఆర్ ఛాలెంజ్ చేసిన పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ మాత్రం ఈ విమర్శలపై ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి ఉంది.మరి హుజూరాబాద్ లో కెసీఆర్ సభ ఉంటుందా ఉండదా అన్న విషయంపై ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ లేని పరిస్థితి ఉంది.
మరి రానున్న రోజుల్లో ముఖ్య మంత్రి కెసీఆర్ సభపై క్లారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.