తమిళ హీరో కార్తీ నటించే ప్రతి సినిమాను తెలుగలో కూడా రిలీజ్ చేస్తుంటారు.ఆయన నటించే సినిమాలకు తమిళనాటతో పాటు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి క్రేజ్ దక్కుతుంది.
దీంతో కార్తీ నటించే తాజా చిత్రం సుల్తాన్ కోసం తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.గతంలో ‘రెమో’ అనే సినిమాను తెరకెక్కించిన బక్కియారాజ్ కన్నణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో సుల్తాన్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ అంచనాలను ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ రెట్టింపు చేశాయి.
అయితే ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ తొలుత ప్లాన్ చేసింది.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తు్న్నారని, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర నిర్మాతల్లో ఎలాంటి క్లారిటీ లేదని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాను ఏది ఏమైనా ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ తెలిపింది.
దీంతో కార్తీ ‘సుల్తాన్’ చిత్రం ఎలాగైనా ఏప్రిల్ 2న రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో కన్నడ కుట్టి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమా కార్తీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రానుంది.
కాగా ఈ సినిమాను నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.మరి సుల్తాన్ చిత్రంతో కార్తీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.