కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సిబిఎస్ఈ వార్షిక పరీక్షల గురుంచి కీలక వ్యాఖ్యలు చేశారు.2021 జనవరి లేదా ఫిబ్రవరి లో జరగవలిసిన సిబిఎస్ఈ వార్షిక పరీక్షలు జరపలేము అని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపాడు.మరల ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తామో అనేది త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు.ఈ విషయం గురుంచి సిబిఎస్ఈ పాఠశాలల ఉపాధ్యాయులతో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా మంగళవారం నాడు మీడియా ద్వారా తెలిపాడు.
ఆన్ లైన్ పరీక్షలు వాయిదా పడినవి కావున ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే పరీక్షలు జరుగుతాయి అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో విధ్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తే వారిపై ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
తద్వారా పై చదువుల అడ్మిషన్లకు, ఉద్యోగాలకు సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.కావున ప్రస్తుతానికి సిబిఎస్ఈ పరీక్షలు వాయిదా వేస్తూ కరోనా తర్వాత పూర్తిగా విద్యార్థులదే భవిష్యత్తు అన్నారు.
వారి భవిష్యత్తుకు ఏవిదమైన ఆటంకం కలిగించే విదంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నారు
.