హైదరాబాద్లో అత్యంత ప్రముఖమైన హాస్పిటల్ నిమ్స్.తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రోగులు ఈ హాస్పిటల్కు వస్తూ ఉంటారు.
పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా అప్పుడప్పుడు ఇక్కడ చికిత్స చేయించుకునేందుకు వస్తారు.ఇంతటి ప్రాచుర్యం ఉన్న నిమ్స్ హాస్పిటల్లో అపశృతి చోటు చేసుకుంది.
నిమ్స్లోని నిర్మల అనే హెడ్ నర్స్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.తనకంటే ఆలస్యంగా డ్యూటీలో జాయిన్ అయిన వారికి జూనియర్స్కు ప్రమోషన్స్ ఇచ్చి తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె ఆవెదన వ్యక్తం చేసింది.
ప్రమోషన్ విషయంలో తనకు పదే పదే అన్యాయం జరుగుతుందని ఆవేదనతో నిర్మల గొంతు కోసుకున్నారు.తీవ్ర గాయం అవ్వడంతో ఆమెకు నిమ్స్ వైధ్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నా కొన్నాళ్ల వరకు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన తప్పదంటూ వైధ్యులు తెలియజేశారు.తనపై ఉన్నతాధికారులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, ప్రమోషన్ విషయంలో పైరవీలకు ప్రాముఖ్యత ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ ఆమె తన గొంతు కోసుకుంది.
కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.మరో వైపు ప్రభుత్వం కూడా ఈ విషయమై సీరియస్ యాక్షన్ తీసుకోనుందట.