నిజమాబాద్ ఎమ్మెల్యే షకీల్ పార్టీలో ఇమడలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా షకీల్ బీజేపీ ఎంపీ అరవింద్ని కలిశారు.
ఈ సందర్భంగా షకీల్ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.దీనిపై స్పందించిన షకీల్ పార్టీలో తానింకా ఇమడలేకపోతున్నట్టుగా చెప్పుకొచ్చారు.
ఈ ఒత్తిడి తట్టుకోవడం తనవల్ల కాదు అని అందుకు రాజీనామ చేయడానికి సైతం సిద్దంగా ఉన్నానంటున్నారు.ప్రస్తుతం పార్టీలో జరిగే పరిణామాలే తనని గుడ్బై చెప్పే విధంగా చేస్తున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చలువ వల్లే తాను ఎమ్మెల్యేగా గెలుపొందాను.కానీ ఆయన్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు.కేసీఆర్కు అవన్ని తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.ఇకపోతే త్వరలోనే షకీల్ రాజీనాయ చేయడం ఖాయం, పార్టీలో తనకు ఏ మేరకు ఒత్తిడి ఉంటే ఇలా రాజీనామాకు సిద్దం అవుతారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎమ్మెల్యేగా పదవి బాధ్యత చేపట్టిన షకీల్ ఇప్పటికి పార్టీలో ఇమడలేకపోవడానికి గల కారణాలేంటి అనేది ఆసక్తిర అంశంగా మారింది.