నిజామాబాద్ జిల్లాలో పురనిపేట గ్రామంలో నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగలో పెను ప్రమాదం తప్పింది.కార్యక్రమంలో భాగంగా చెరువు గట్టున మంత్రి ప్రశాంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు చేశారు.
అయితే ఉత్సవాల్లో భాగంగా పేల్చిన టపాసులలో నిప్పు రవ్వలు రాజుకోవడంతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.దీంతో సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్ పై పడటంతో కాలిపోయింది.
వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.